Last Updated:
న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు చారిత్రక విజయంతో ముగిసింది. ప్రధాని మోదీ 15 దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపగా, ఉమ్మడి ఏకాభిప్రాయంతో రూపొందించిన న్యూఢిల్లీ డిక్లరేషన్కు సభ్య దేశాలన్నీ పూర్తి ఆమోదం తెలిపాయి.
న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ వేదికపై భారత్ తన దౌత్యపరమైన వ్యూహాలతో తిరుగులేని విజయం సాధించింది. వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026’ పేరుతో రూపొందించిన ఉమ్మడి తీర్మానానికి సభ్య దేశాలన్నీ పూర్తి ఆమోదం తెలిపాయి. ఈ మూడు రోజుల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్తో గడిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సహా సుమారు 15 దేశాల అగ్రనేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

