Last Updated:
Sugar Prices Fall: చక్కెర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. మిల్లుల నుంచి టోకు వ్యాపారులకు విక్రయించే ఎక్స్-మిల్ ధరలు ఇటీవల ఏకంగా 20 శాతం వరకు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. మరోవైపు మార్కెట్లో కృత్రిమ కొరత, నిల్వలను అరికట్టేందుకు సెప్టెంబర్ నుంచి పక్షం రోజుల కొత్త కోటా విధానాన్ని అమలు చేయనుంది. దీంతో రాబోయే రోజుల్లో చక్కెర సరఫరా పెరిగి, చిల్లర ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిన చక్కెర ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మిల్లులు టోకు వ్యాపారులు, డీలర్లకు చక్కెరను విక్రయించే ధరలను సూచించే ఎక్స్-మిల్ ధరలు ఇటీవలి రోజుల్లో సుమారు 20 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 28, శుక్రవారం వెల్లడించింది. ఎక్స్-మిల్ ధరలు తగ్గడంతో దాని ప్రభావం చిల్లర మార్కెట్పైనా కనిపించడం ప్రారంభమైందని ప్రభుత్వం తెలిపింది.

