Expressway: నేడు లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం.. 35 నిమిషాల్లో ప్రయాణం, పూర్తి వివరాలు |


ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించిన పూర్తి వివరాలు, నిర్మాణం, ప్రయోజనాలు చూద్దాం.

ఇది ఎలాంటిది?:

జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు సాంకేతికంగా ఒక అద్భుతం. దీనిని సుమారు ₹4,700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు

ఇవి కూడా చదవండి: Telangana Voter List Verification 2026: ఎన్యూమరేషన్ ఫారం నింపకపోతే ఓటు హక్కు గల్లంతే.. ఇలా తప్పక చెయ్యండి!

మార్గం, పొడవు: ఈ 6 లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే-6) మొత్తం 63 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. లక్నోలోని షహీద్ పత్ దగ్గర ప్రారంభమై కాన్పూర్‌లోని చకేరీ వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఇందులో 45 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ (పూర్తిగా కొత్త) మార్గం కాగా, పట్టణ రద్దీని అధిగమించేందుకు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ (వంతెనల పై భాగం) కారిడార్‌గా నిర్మించారు.

* బారియర్-లెస్ టెక్నాలజీ: ఇది భారతదేశపు మొట్టమొదటి బారియర్-లెస్ (Barrier-less) ఎక్స్‌ప్రెస్‌వే. అంటే, ఇక్కడ సాధారణ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. టోల్ వసూలు మొత్తం అత్యాధునిక టెక్నాలజీ ద్వారా జరుగుతుంది, తద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.

* అధునాతన వ్యవస్థలు: ఈ రహదారి నిర్మాణంలో 3D ఆటోమేటెడ్ మెషిన్ గైడెన్స్ (AMG) టెక్నాలజీని ఉపయోగించారు. అలాగే ప్రయాణికుల భద్రత కోసం ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS), పీటీజడ్ (PTZ) కెమెరాలు, వేగ నియంత్రణ రాడార్లు, అత్యవసర కాల్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ.. రోడ్డు పక్కన 46,000 మొక్కలను నాటనుంది.

దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ మౌలిక సదుపాయాల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోతోంది. దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే:

1. ప్రయాణ సమయం భారీగా ఆదా: ప్రస్తుతం లక్నో, కాన్పూర్ మధ్య ప్రయాణించడానికి 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుండగా, ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఆ సమయం కేవలం 35 నుంచి 45 నిమిషాలకు తగ్గిపోతుంది. ఈ రహదారిపై గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది.

2. వ్యాపార, ఆర్థిక వృద్ధి: ఉత్తరప్రదేశ్‌కి లక్నో.. రాజకీయ రాజధాని కాగా, కాన్పూర్ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం. ఈ రెండు నగరాల మధ్య సరుకు రవాణా వేగవంతం అవ్వడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి. కొత్త పెట్టుబడులకు విశేష అవకాశాలు ఏర్పడతాయి.

3. మెరుగైన ప్రాంతీయ కనెక్టివిటీ: ఇది భవిష్యత్తులో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి లింక్ అవుతుంది. దీనివల్ల ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాగ్‌రాజ్-వారణాసి కారిడార్ ద్వారా బీహార్, నేపాల్‌లకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.

4. రద్దీ నివారణ: ప్రస్తుతం ఉన్న 94 కిలోమీటర్ల NH-27 రహదారిపై ట్రాఫిక్ రద్దీ బాగా ఉంటోంది. ఎక్స్‌ప్రెస్ వే దీన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఫలితంగా ఇంధన ఆదా జరగడమే కాకుండా, వాహనదారులకు సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 July 2026, 10:53 am Digital Edition : Prabhanews
Expressway: నేడు లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం.. 35 నిమిషాల్లో ప్రయాణం, పూర్తి వివరాలు |

ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించిన పూర్తి వివరాలు, నిర్మాణం, ప్రయోజనాలు చూద్దాం.
भाजपा द्वारा रोज़ देश को एक नया इंफ्रा देने के क्रम में नया अध्याय जुड़ने जा रहा है।
रक्षा मंत्री राजनाथ सिंह जी, परिवहन मंत्री नितिन गडकरी जी और मुख्यमंत्री योगी आदित्यनाथ जी आज राष्ट्र को लखनऊ - कानपुर एक्सप्रेसवे समर्पित करेंगे। pic.twitter.com/BIFdnXcAfU— Arvind Mohan Singh (@ArvindSinghUp) July 13, 2026ఇది ఎలాంటిది?:జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు సాంకేతికంగా ఒక అద్భుతం. దీనిని సుమారు ₹4,700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారుఇవి కూడా చదవండి: Telangana Voter List Verification 2026: ఎన్యూమరేషన్ ఫారం నింపకపోతే ఓటు హక్కు గల్లంతే.. ఇలా తప్పక చెయ్యండి!మార్గం, పొడవు: ఈ 6 లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే-6) మొత్తం 63 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. లక్నోలోని షహీద్ పత్ దగ్గర ప్రారంభమై కాన్పూర్‌లోని చకేరీ వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఇందులో 45 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ (పూర్తిగా కొత్త) మార్గం కాగా, పట్టణ రద్దీని అధిగమించేందుకు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ (వంతెనల పై భాగం) కారిడార్‌గా నిర్మించారు.* బారియర్-లెస్ టెక్నాలజీ: ఇది భారతదేశపు మొట్టమొదటి బారియర్-లెస్ (Barrier-less) ఎక్స్‌ప్రెస్‌వే. అంటే, ఇక్కడ సాధారణ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. టోల్ వసూలు మొత్తం అత్యాధునిక టెక్నాలజీ ద్వారా జరుగుతుంది, తద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.* అధునాతన వ్యవస్థలు: ఈ రహదారి నిర్మాణంలో 3D ఆటోమేటెడ్ మెషిన్ గైడెన్స్ (AMG) టెక్నాలజీని ఉపయోగించారు. అలాగే ప్రయాణికుల భద్రత కోసం ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS), పీటీజడ్ (PTZ) కెమెరాలు, వేగ నియంత్రణ రాడార్లు, అత్యవసర కాల్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ.. రోడ్డు పక్కన 46,000 మొక్కలను నాటనుంది.
India Without Congress
📍Tomorrow, UP gets its 11th Expressway.The 63km Lucknow–Kanpur Expressway will cut travel time to just 1 hour.From promises to progress.🔥 pic.twitter.com/VMvO1u0LXi— Rahul (@Rahulk123d) July 12, 2026దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ మౌలిక సదుపాయాల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోతోంది. దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే:1. ప్రయాణ సమయం భారీగా ఆదా: ప్రస్తుతం లక్నో, కాన్పూర్ మధ్య ప్రయాణించడానికి 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుండగా, ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఆ సమయం కేవలం 35 నుంచి 45 నిమిషాలకు తగ్గిపోతుంది. ఈ రహదారిపై గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది.2. వ్యాపార, ఆర్థిక వృద్ధి: ఉత్తరప్రదేశ్‌కి లక్నో.. రాజకీయ రాజధాని కాగా, కాన్పూర్ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం. ఈ రెండు నగరాల మధ్య సరుకు రవాణా వేగవంతం అవ్వడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి. కొత్త పెట్టుబడులకు విశేష అవకాశాలు ఏర్పడతాయి.3. మెరుగైన ప్రాంతీయ కనెక్టివిటీ: ఇది భవిష్యత్తులో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి లింక్ అవుతుంది. దీనివల్ల ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాగ్‌రాజ్-వారణాసి కారిడార్ ద్వారా బీహార్, నేపాల్‌లకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.4. రద్దీ నివారణ: ప్రస్తుతం ఉన్న 94 కిలోమీటర్ల NH-27 రహదారిపై ట్రాఫిక్ రద్దీ బాగా ఉంటోంది. ఎక్స్‌ప్రెస్ వే దీన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఫలితంగా ఇంధన ఆదా జరగడమే కాకుండా, వాహనదారులకు సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

Source link